పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని అన్నారు ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, అంబేడ్కర్ కాలనీ, చైతన్య నగర్, గాంధీ పార్క్, వెంకటేశ్వర కాలనీ కేంద్రాలలో చిన్నారులకు బీఆర్ఎస్ నాయకులు ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
అనంతరం ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ పోలియో రహిత భారతదేశం నిర్మించడమే మన అందరి లక్ష్యం అని తెలిపారు. అనంతరం, రామచంద్రపురం మండలంలోని పోలియో కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది మరియు నర్సులకు ఎండీఆర్ ఫౌండేషన్ ప్రిథ్వీరాజ్ తరఫున మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు ప్రజలు, ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు సక్రమంగా పాల్గొన్నారు.