ASHA-WORKERS.jpg
పటాన్ చెరు
ఆశా వర్కర్ల కు పి ఆర్ సి అమలు చేసి,కనీస వేతనం 21వేల రూపాయలు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్లకు పిఆర్సి అమలుచేసి కనీస వేతనం 21 వేలు పెంచాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని భానూర్ పి హెచ్ సి సెంటర్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆశా వర్కర్ల కు 11 వ పి అర్ సి ప్రకారం వేతనాలు పెంచి,వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా వర్కర్ల కు పీఆర్సీ అమలు చేస్తున్నామని ప్రకటించిన దని అన్నారు.4నెలలు గడిచినా నేటికీ చెల్లించ లేదని మండిపడ్డారు.కనీస వేతనం 21వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న,ఆశా వర్కర్ల ను రెగ్యులర్ చేయడం లేదని అన్నారు.రెగ్యులర్ చేయాలని అన్నారు.ప్రస్తుతం వచ్చే వేతనాలు 7500/-రూపాయిలు సరిపోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆశావర్కర్ల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఆశ వర్కర్లు లక్ష్మి, మాధవి, భాగ్య, లక్ష్మి ఇతరులు పాల్గోన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…