కార్మిక రంగానికి పిజెఆర్ సేవలు చిరస్మరణీయం

politics Telangana

_పిజెఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక రంగానికి పిజెఆర్ చేసిన సేవలు మరువలేనివని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి, కార్మిక నాయకులు దివంగత పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామ పరిధిలోని కిర్బి పరిశ్రమ ఆవరణలో బిఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీజేఆర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కార్మికులకు అన్నదానం నిర్వహించారు. పటాన్చెరు నియోజకవర్గంలో కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు చేసిన మహోన్నత వ్యక్తి పి జె ఆర్ అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయకుమార్, పరిశ్రమ ఎం డి పిలిప్పోస్, పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ రాజమహేందర్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, జిల్లా అధ్యక్షుడు శివశంకరరావు, పాశ మైలారం గ్రామ సర్పంచ్ కృష్ణ, కార్మిక విభాగం నాయకులు మాధవరావు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *