– సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ : పోరెడ్డి బుచ్చిరెడ్డి
మనవార్తలు , శేరిలింగంపల్లి :
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గల ,చందా నగర్ డివిజన్ లోని ,తారా నగర్ కాలనీ నుండి గోపీనాథ్ కాంప్లెక్స్ రోడ్డులో గత కొన్ని రోజుల నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగిపొర్లుతు, రోడ్డు మొత్తం డ్రైనేజ్ వాటర్ తో నిండిపోవడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాలనిలో బీజేపీ బృందం శనివారం రోజు పర్యటించారు. దీనికి సంబంధిత హెచ్ఎం డబ్ల్యూ ఎస్ఎస్బి అధికారికి ఫోన్ చేసిన సందర్భంలో వాళ్ళు మా పరిధి లోకి రాదని జిహెచ్ఎంసి వాళ్లు చూసుకుంటారని అనడం అధికారులు సమన్వయ లోపానికి నిదర్శనం అన్నారు. ఇది అధికారుల సమన్వయ లోపం వల్ల తారా నగర్ కాలనీ రోడ్డు మొత్తం డ్రైనేజీ నీటితో నిండిపోయి ఉదని, కావున వెంటనే డ్రైనేజీ లైన్ లో నిండిపోయిన చెత్తను తీసివేసి, రోడ్లను శుభ్రం చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని బిజెపి తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి బుచ్చిరెడ్డి, బిజేపీ చందానగర్ డివిజన్ అధ్యక్షులు గొల్లపల్లి రాంరెడ్డి,బీజేపి చందానగర్ డివిజన్ ఉపాధ్యక్షులు వేణుగోపాల్, నర్సింహా రెడ్డి, బీజేవైఎం నాయకులు కిరణ్, వినోద్, కాలనీ వాసులు సందీప్ రెడ్డి ,గోవింద్, యుగేందర్, వెంకటేశ్వర్ రావు, గురువయ్య,, లక్ష్మణ్ మరియు ఇతరులు పాల్గోన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…