తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు_బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు:

బీజేపీ అంటేనే మచ్చ లేని పార్టీ ,

తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాషాయ జెండా

బీజేపీ పార్టీలో వలసల జోరు పెరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు బీజేపీలోకి చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ కండువా కప్పి పార్టీకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. సమస్యల నుంచి దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ వరి కొనుగోలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పైసా కేంద్ర నిధులతో అభివృద్ధి జరుగుతుందని బండి సంజయ్ గుర్తు చేశారు రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గోల్కొండా కీళ్ల మీద భారతీయ జెండా రెప రెప లాడుతుందని ,బీజేపీ అంటే కేసీఅర్ కు భయం పట్టుకుందని రాబోయే ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని బండి సంజయ్ అన్నారు ఉద్యోగాల కోసం ఈ నెల 27 న ధర్నా చౌకేలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే తన తల నరుక్కుంటానన్న బండి సంజయ్.. హామీలు నెరవేర్చుకోకుంటే ముఖ్యమంత్రి తల నరుక్కుంటారా అని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాబుమోహన్ ,పటాన్చెరు మాజీ ఎమ్యెల్యే నందీశ్వర్ గౌడ్ ,ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *