_ఆహ్వాన పత్రికను ఆవిష్కరించి ఎమ్మెల్యే జిఎంఆర్
మనవార్తలు , అమీన్పూర్:
అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ దుర్గామాత ఆలయ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.ఆగస్టు 4వ తేదీ నుండి 7 వ తేదీ వరకు ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, గుమ్మడిదల జెడ్పిటిసి కుమార్ గౌడ్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నగేష్, వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు