పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశనుండే మానసిక ధైర్యం పెంపొందించుకోవాలని.. ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు లాంటిదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో నిరుపేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడంలో భాగంగా కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదగ్గ పరిణామం అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా జస్ట్ డయల్,. పేటీఎం, టెక్ మహీంద్రా సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలో డిగ్రీ కళాశాలకు చెందిన 26 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. మీరందరికి ఎమ్మెల్యే జిఎంఆర్ చేతులమీదుగా ప్లేస్మెంట్ లెటర్లు అందించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్, ప్రవీణ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.