Districts

హత్య కేసును 48 గంటల్లో ఛేదించిన పటాన్ చెరు పోలీసులు

రాజునాయక్ హత్యకు భూ వివాదాలే కారణం _డీఎస్పీ భీంరెడ్డి

మనవార్తలు , పటాన్ చెరు

వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. భూ వివాదాలే కారణమని పోలీసులు నిగ్గుతేల్చారు. ఈ మేరకు పటాన్ చెరు డీఎస్పీభీంరెడ్డి పటాన్ చెరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో హత్య వివరాలను వెల్లడించారు. దారుణ హత్యకు గురైన రాజునాయక్ పెదనాన్న కుమారుడు రాంసింగ్ ఈ హత్యకు కీలకమని డీఎస్పీ వెల్లడించారు. ఇటీవల వెలమల తాండాలో కొంతమంది భూములను విక్రయించగా కోటి యాభై లక్షలు రావటంతో రాజునాయక్ తాను వాసులందరికీ కోటి రూపాయలు మాత్రమే ఇచ్చే యాభై లక్షలు తీసుకున్నాడు.

దీనిపై తాండ వాసులంతా రాజు నాయక్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపధ్యంలో రాజునాయక్ పెదనాన్నకు చెందిన 32 గుంటల భూమిని అమ్మాలని పెదనాన్న కుమారుడు రాంసింగ్ పై ఒత్తిడి తెచ్చాడు. దీనిపై తీవ్ర బెదిరింపులకు కూడా పాల్పడటంతో రామ్ సింగ్ రాజునాయక్ హత్యకు తెరదీశాడు. కంది మండలం కౌలం పేటకు చెందిన రమేష్ విష్ణులతో రాజు నాయక్ను హత్య చేయడానికి పది లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఇందులో భాగంగా లక్షా యాభై వేలు ఫోన్పే ద్వారా నిందితులకు అందించాడు.ప్రకాశం జిల్లాకు చెంది సంగారెడ్డిలో నివాసముంటూ గతంలో పలు హత్య కేసుల్లో నిందితుడైన మాధవ్ ను కలుపుకున్న రమేష్ విష్ణులో పకడ్బందీగా రాజును పిలిపించి గొడ్డలితో నరికి హత్య చేశారు. అనంతరం రాజు వాహనంలోనే మృతదేహాన్ని తరలించి మార్గమధ్యలో తలను వేరు చేసి కుష్నర్ గ్రామ సమీపంలో ఓ వాగులో తలను పడేసి మొండాన్ని మంజీర బ్యారక్లోపడేశారు. వీరికి సహకరించిన వెంకటేశ్ మల్లేష్ బాలు లను కూడా అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

12 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

13 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago