గణితశాస్త్రంలో పప్పుల అశోక్ కు పీహెచ్.డీ

Telangana

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి పప్పుల అశోక్ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ నమూనాలను ఉపయోగించి క్రిప్టోకరెన్సీ ధర అంచనా: ఒక సమగ్ర తులనాత్మక కాల శ్రేణి విశ్లేషణ’ చేసి, ఆయన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ గణాంక శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ డి. మల్లికార్జునరెడ్డి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ డాక్టరల్ పరిశోధన, బిట్ కాయిన్ (బీటీసీ), ఎథేరియం (ఈటీహెచ్), బైనాన్స్ కాయిన్ (బీఎన్ బీ) వంటి అత్యంత అస్థిరమైన డిజిటల్ ఆస్తులను అంచనా వేయడానికి అధునాతన పద్ధతులను అన్వేషించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం సాంప్రదాయ గణాంక నమూనాలు, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్ లు, డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్లను మూల్యాంకనం చేస్తుందని, అంచనా ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి హైబ్రిడ్ మోటల్స్ ను పరిచయం చేస్తుందని వెల్లడించారు.

ఈ పరిశోధన ఫలితాల ప్రకారం, హైబ్రిడ్ డీప్ లెర్నింగ్ మోడల్స్- ముఖ్యంగా BiLSTM-GRU ఫ్రేమ్ వర్కు-ప్రధాన పనితీరు కొలమానాలన్నింటిలో సాంప్రదాయ, స్టాండ్ అలోన్ మోడల్స్ ను గణనీయంగా అధిగమించి, క్రిప్టోకరెన్సీ ధర అంచనాలో మెరుగైన ఖచ్చితత్వం, పటిష్టతను అందిస్తున్నాయని స్పష్టమవుతోందన్నారు.ఈ పరిశోధన, ఆర్థిక అంచనాలలో హైబ్రిడ్ ఏఐ నమూనాల పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ, పెట్టుబడిదారులకు, విశ్లేషకులకు, విస్తృత ఫిన్ టెక్ పర్యావరణ వ్యవస్థకు విలువైన అంతర్దృష్టులను అందిస్తుందని తెలిపారు.

డాక్టర్ అశోక్ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, గణిత, గణాంక శాస్త్ర విభాగాధిపతి డాక్టర జాదవ్ గణేష్, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *