_అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఉద్యోగాల సంక్షేమంతో పాటు దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గ్రామ రెవెన్యూ సహాయకుల ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పటాన్చెరు మండల వీఆర్ఏల ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పూర్తిస్థాయిలో పర్మినెంట్ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

