గీతన్ క్యాంపస్ లో జిమ్ ప్రారంభం

Telangana

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం హెదరాబాద్ ప్రాంగణంలోని ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో విద్యార్థుల కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ‘క్యాంపస్ జెమ్’ను ప్రొవీసీ (క్యాంపస్ లెస్ట్ డాక్టర్ గౌతమరావు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యవంతమైన శరీరానికి, దాని ఫిట్నెస్ కోసం విద్యార్థులు, అధ్యాపకులకు జిమ్ అవసరమని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యవంతమైన మనస్సు, శరీర వికాసానికి ఇది ఎంతో అవసరమని, ప్రతిరోజూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. క్యాంపస్ జీన్లో ఖరీదైన బ్రెడ్ మిక్స్డ్ సహా ఆధునిక పరికరాలను అమర్చారు. వ్యాయామశాల షెడ్యూలు ప్రకారం విద్యార్థులు దీనిని వినియోగించుకోచ్చని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు, రెసిడెంట్ డెరెక్టర్  డీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ బిజినెస్ డెరెక్టర్ వినయ్ కుమార్ అప్పరాజు, స్పోర్ట్స్ డెరెక్టర్ అరుణ్ కార్తీక్, మానన వనరుల విభాగం డెరెక్టర్ ఆర్. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *