గొర్రెలిస్తే సరిపోదు మేపేందుకు స్థలం ఇవ్వాలి -ప్రతి గ్రామానికి పది ఎకరాల స్థలం కేటాయించాలి

Hyderabad politics Telangana

రామచంద్రపురం

 

తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్న పథకంలో భాగంగా గొర్రెలతో పాటు మేపేందుకు ప్రతి గ్రామంలో పది ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని బిజెపి రాష్ట్ర నాయకురాలు గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం అమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణి చేపడుతున్న ప్రభుత్వం లబ్ధిదారులకు గొర్రెలతో పాటు స్థలం కేటాయిస్తే గొర్రెలను మేపేందుకు ఉపయోగపడుతుందన్నారు.

గ్రామాల్లో ఉండడానికి ఇండ్లు సరిపడక ఇబ్బందులు పడుతున్న గొర్రెల పెంపకందారులకు ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంపకం కష్టంగా మారిందన్నారు. స్థలం లేక మొదటి విడతలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను పెంచడానికి, మేపడానికి వారు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలిపారు. ప్రభుత్వం గొర్రెలతో పాటు వాటిని మేపేందుకు స్థలం కేటాయిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, అదే విధంగా గతం లో ఉన్న గొర్రెలకు కూడ ఇన్సూరెన్సు వర్థింపచెయలని చుచించారు. రెండో విడత పంపిణీలో భాగంగా లబ్ధిదారులకు గొర్రెలతో పాటు ప్రతి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *