అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ 

politics Telangana

భవనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :

పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇటీవల అమీన్పూర్ కేంద్రంగా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ మంజూరు అయిందని ఆయన తెలిపారు.అమీన్పూర్ మున్సిపాలిటీ తో పాటు తో పాటు రామచంద్రాపురం పరిధిలోని డివిజన్లు, మున్సిపాలిటీలు నూతన పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తాయని తెలిపారు.ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు కోసం..మంగళవారం ఉదయం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో గల పాత గ్రామపంచాయతీ భవనాన్ని వివిధ శాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. శాఖ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీజడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, ఎక్సైజ్ సిఐ పరమేశ్వర్ గౌడ్, సత్యనారాయణ, ఏఈ ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *