పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఆర్కిటెక్చర్ లో పరిశోధనను పెంపొందించడానికి జూలై 20-21 తేదీలలో ‘విద్యార్థుల కోసం నేషనల్ రీసెర్చ్ సింపోజియం’ను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హెదరాబాద్ నిర్వహించనుంది. ఈ విషయాన్ని సదస్సు నిర్వాహకురాలు ప్రొఫెసర్ కుర్రి శ్రీ స్రవంతి శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు.కళ, వాస్తుశిల్పం ద్వారా నగరాల గుర్తింపు; నిర్మాణ సంస్కృతి, వారసత్వ నిర్వహణ, పర్యావరణ సామర్థ్యం, స్థిరమైన భవిష్యత్తు; సమకాలీన నిర్మాణ పద్ధతులు, వాస్తుశిల్పంలో వైవిధ్యం వంటి ఇతివృత్తాలతో ఈ సింపోజియం నిర్వహించనున్నట్టు ఆమె వివరించారు.ఆసక్తి ఉన్నవారు, జూన్ 12వ తేదీలోగా పరిశోధనా పత్రాలను సమర్పించాలని; వాటిపై వ్యాఖ్య లేదా ఆమోదాన్ని జూలై 1వ తేదీలోగా తెలియజేస్తాయని, తుది సమర్పణ జూలై 10వ తేదీగా చేయాలని నిర్వాహకురాలు స్పష్టీకరించారు.బీఆర్క్ ఎంఆర్క్, పీహెచ్ చేస్తున్న విద్యార్థులు ఈ సింపోజియంలో పాల్గొనడానికి అర్హులని, ఇందులో పత్ర సమర్పణ చేసేవారికి ఉచిత వసతితో పాటు 3-ఏ/సీ రెల్లు టిక్కెట్లు ఇస్తామని ఆమె తెలిపారు. ఇతరత్రా వివరాల కోసం spaul@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు.
