నరేంద్రమోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు :బిజెపి జిల్లా నాయకులు టీ. రవీందర్ రెడ్డి

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేశామని టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంకలు గుద్దుకుంటున్నరు అయితే నిజంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం ఎంతో ముందుకు పోయింది,ప్రపంచ దేశాలలో నెంబర్వన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అధికారంలో ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేయమని కార్యకర్తలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించే కెసిఆర్ ఒక దేశ ప్రధానమంత్రి రాష్ట్రానికి వస్తే స్వాగతం పలకలేని సంస్కారం లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,ప్రపంచ దేశాలు విశ్వగురువుగ చూసే విధంగా చేసిన భారతదేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మ తగలబెట్టడం నిజంగా సిగ్గుచేటు అని బిజెపి జిల్లా నాయకులు టీ. రవీందర్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *