పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఈనెల 24వ తేదీన నిర్వహించ నారీ సాహిత్య భేరి అంతర్జాతీయ శతాధిక కవయిత్రుల సమ్మేళనం కార్యక్రమానికి శేరిలింగంపల్లి కి చెందిన మోటూరి జయశ్రీ ప్రత్యేక అతిథిగా ఎంపికయ్యారు . తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగ వరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వా హకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఈ మేరకు అంతర్జాతీయ స్థాయిలో ప్రకటన విడుదల చేశారు. దాదాపు 14 గంటల పాటు నిర్విరామంగా జరిగే నారీ సాహిత్య భేరి సాహిత్య సమ్మేళనంలో భారత్ తో పాటు విశ్వ వ్యాప్తంగా 15 దేశాలకు చెందిన ప్రముఖ తెలుగు కవయిత్రులు, రచ యిత్రులు పాల్గొననున్నారు.ఇందులో మోటూరి జయశ్రీ తమ కవిత్వాన్ని వినిపించనున్నారు. అరుదైన గౌరవం, అవకాశం అందించిన తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగ వరపు, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వా హకుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా అత్యంత ప్రతిష్టాత్మక తానా ప్రపంచ సాహిత్య వేదిక లో పాల్గొనేందుకు ప్రతిపాదించిన తెలుగు వెలుగు సాహిత్య వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మోటూరి నారాయణరావు కు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సాహితీ వేత్తలు, సాహితీ సంస్థల ప్రతినిధులు శుభాకాంక్షలుతెలిపారు.
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని లలిత,…