మతసామరస్యానికి ప్రతీక మొహర్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Hyderabad politics Telangana

పటాన్ చెరు

మత సామరస్యానికి, త్యాగనిరతికి మొహర్రం పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మొహర్రం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు షకీల్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి నిర్వహించుకునే పండుగ మొహర్రం అన్నారు. ధర్మ పరిరక్షణ, శాంతియుత సమాజ స్థాపన కోసం మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన ప్రాణత్యాగం నుంచి నేటి సమాజం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్, తులసి రెడ్డి, ధనరాజ్ గౌడ్, మైనార్టీ సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *