పటాన్ చెరు
జిహెచ్ఎంసి పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సంకార్మికుల క్షేమానిప్రభుత్వం కట్టుబడి ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధినిర్వహణలో పారిశుద్ధ కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ పరికరాలు, యూనిఫామ్ ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు. నగరంలో పచ్చదనం-పరిశుభ్రత వెళ్లివిరియడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ప్రశంసనీయమైనది అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ బాలయ్య, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.