పటాన్చెరు డి.ఎస్.పి భీమ్ రెడ్డి
ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రాయన గుట్ట కు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఐలాపూర్ గ్రామంలో భూములు ఉన్నాయని, ఇందుకు సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని తెలిపారు. తమ భూముల్లో సర్పంచి రవి గృహాలు నిర్మించి అమ్మేస్తున్నారని తెలియడంతో , విషయం తెలుసుకునేందుకు సంఘటన స్థలానికి వారు వచ్చారని తెలిపారు. వారి దగ్గర లైసెన్సు రివాల్వర్లు ఉన్నాయని పేర్కొన్నారు. సర్పంచ్ రవి గ్రామస్తులతో కలిసి దాడి చేసేందుకు ప్రయత్నించడంతో, తుపాకులు బయటకు తీశారు అని తెలిపారు. ఈ విషయంలో నిందితులకు, భూములకు సంబంధించి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కి ఎటువంటి సంబంధం లేదని డిఎస్పి భీమ్ రెడ్డి తెలిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.