మనవార్తలు ,పటాన్చెరు
పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో రెండు కోట్ల 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న బైపాస్ సిసి రోడ్డు నిర్మాణ పనులకు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన రోడ్డు నిర్మాణానికి క్రషర్స్ అసోసియేషన్ సహకారం అందించడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. నూతన రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలతో పాటు క్రషర్ ల పరిశ్రమలకు మెరుగైన రవాణా సదుపాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, మాణిక్ రెడ్డి, క్రషర్ అసోసియేషన్ ప్రతినిధులు, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.