మనవార్తలు ,అమీన్పూర్:
మూడు నెలలకు ఒకసారి ప్రజల సమస్యలపై చర్చించే మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు అధికారులు పూర్తి వివరాలతో హాజరుకావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. శనివారం అమీన్పూర్ ఎంపీపీ దేవానంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు వచ్చిందని, క్షేత్రస్థాయిలో పొరపాట్లు లేకుండా సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనుల విషయంలో నిధులు లేవని సాకులు చెప్పొద్దని, ఉన్నత అధికారులు, సంబంధిత మంత్రులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు. ఉద్యానవన శాఖ సమీక్ష సందర్భంగా మండలంలో చేపడుతున్న పనుల వివరాలను తెలపాలని సంబంధిత అధికారి శైలజను ఎమ్మెల్యే సూచించగా, పూర్తి వివరాలు తీసుకుని రాలేదని సమాధానం ఇవ్వడంతో ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలిచి మండల పరిషత్ సమావేశాలకు అధికారులు పూర్తి వివరాలతో హాజరు కావాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఐలాపూర్ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పనులు వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతు బీమా ద్వారా ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయల చెక్కును స్థానిక ప్రజాప్రతినిదుల ద్వారా రైతు కుటుంబానికి అందించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, స్థానిక ప్రజాప్రతినిదులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో మల్లీశ్వర్, తహసిల్దార్ విజయకుమార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నా