Telangana

ఇస్నాపూర్ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని మత్స్యకారుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, మత్స్యకారుల సొసైటీలో నూతన సభ్యత్వానికి కృషి చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో ఇస్నాపూర్ మత్స్యకార సహకార సంఘం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని వివిధ చెరువుల పరిధిలోగల మత్స్యకార సహకార సంఘంలో నూతన సభ్యత్వం అందించడం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పరిధిలోని పెద్ద చెరువు చేప పిల్లల పెంపకానికి అనువుగా లేదని సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నివేదిక ఇవ్వడం మూలంగా, చేప పిల్లలు పంపిణీ చేయడం లేదని మత్స్యశాఖ జిల్లా అధికారి నరసింహారావు ఎమ్మెల్యే జిఎంఆర్ కి తెలిపారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. చేపల పెంపకం పైన పూర్తిగా ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ముదిరాజ్ సంఘం సభ్యులు ఆర్థికంగా నష్టపోతారని, పెద్ద చెరువు కాలుష్యంపై సమగ్ర నివేదిక అందించాలని పిసిబి అధికారి గీతను ఆదేశించారు. పెద్ద చెరువుకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సభ్యత్వం అందించాలని అధికారులను ఆదేశించారు. పిసిబి నివేదిక అనంతరం పెద్ద చెరువు పరిధిలోని పరిశ్రమల ద్వారా మత్స్యకారులందరికీ ప్రతి ఏటా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రాపురం రాయసముద్రం చెరువు పరిధిలోని మత్స్యకార సహకార సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డి ఈ రామ స్వామి, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రాఘవేందర్, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, సలహాదారులు పెంటయ్య, నర్సింలు, రవీందర్, రామచంద్రాపురం ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీశైలం, రాములు, వెంకట్, గాంధీ శ్రీను, పెద్ద రాజు, టెంట్ హౌస్ శ్రీను, ఉమ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago