అమీన్పూర్
కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన ప్రారంభించారు. అనంతరం 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రతి కాలనీలో అంతర్గత మురుగునీటి కాలువలు, సిసి రోడ్లు, వీధి దీపాలు, రక్షిత మంచినీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు అందిస్తున్నట్లు తెలిపారు.
నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసినప్పుడే ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామని అన్నారు. తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతి జిల్లాకు కావలిసిన సదుపాయాలను సమకూరుస్తుందని అమీన్పూర్ మండలం దినదిన అభివృద్ధి చెందుతుందని మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచ్ ఈర్ల నితిషా శ్రీకాంత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.