అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
అమీన్ పూర్:
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో మౌళిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం మున్సిపల్ పరిధిలోని లింగమయ్య కాలనీ లో పది లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకీ విస్తరిస్తున్న అమీన్పూర్ మున్సిపాలిటీలో సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యం, పారిశుద్ధ్యం పనులకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సుజాత, కౌన్సిలర్లు, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.