గణేష్ గడ్డ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శ్రావణ మాసం పురస్కరించుకొని సోమవారం ఉదయం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని గణేష్ గడ్డ సిద్ధి వినాయక దేవాలయాన్ని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పై స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, ఆలయ మాజీ ధర్మకర్తలు, ఈఓ లావణ్యతో సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హాజరైన గ్రామ మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, రుద్రారం పిఎసిఎస్ చైర్మన్ పాండు, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, నరసింహ రెడ్డి, వెంకన్న, రాజు, హరిప్రసాద్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *