అమీన్పూర్ మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Districts politics Telangana

_సమిష్టి సహకారంతో మున్సిపాలిటీల అభివృద్ధి

_ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి

_పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

సాంకేతిక వ్యవస్థ రోజురోజుకీ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవశ్యకత అంశమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు శ్రీకృష్ణదేవరాయ కాలనీలో మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు కంప్యూటర్ సెట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా అందజేశారు. బీరంగూడ మంజీరా నగర్ కాలనీలో వడ్డెర సంఘం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకృష్ణ బృందావన్ కాలనీలో దేవాలయ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. దాతలు కాలనీ సంక్షేమ సంఘాల సహాయ సహకారాలతో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దేవాలయాల అభివృద్ధికి ఎల్లప్పుడూ తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింహా గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *