విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

Hyderabad Telangana

పటాన్ చెరు

పటాన్ చెరు మండలం ముత్తంగి వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని ,ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని  , పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు .భక్తులందరూ కరోనా నిబంధనలకు అనుగుణంగా హాజరు కావాలని ఆయన సూచించారు. ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ సంపూర్ణ సహకారం అందించారని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెల్లాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆలయ కమిటీ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *