విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Hyderabad Telangana

పురాతన ఆలయాల జీర్ణోర్ధరణకు సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు

పటాన్చెరు పట్టణంలోని చైతన్య నగర్ లో జీర్ణోద్ధరణ గావించిన శ్రీ ముత్యాలమ్మ, పోచమ్మ దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతిష్టాపన సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తి పెంపొందించుకోవాలని కోరారు. నియోజకవర్గ పరిధిలో పురాతన ఆలయాలను సొంత నిధులతో జీర్ణోద్ధరణ గావిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ నుండి 30 వ తేదీ వరకు ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, కొమరగూడెం వెంకటేష్, ఎట్టయ్య, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *