అమీన్పూర్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

అమీన్పూర్,,మనవార్తలు ప్రతినిధి :

మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీ షిరిడి సాయి కాలనీలో మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన నల్లా కనెక్షన్లను ఆయన ప్రారంభించారు. అనంతరం జవహర్ నగర్ కాలనీలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 9 లక్షల రూపాయల అంచనా వ్యయంతో మన ఊరు మనబడి పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. అనంతరం కృష్ణారెడ్డిపేట గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, గ్రామ సర్పంచ్ నితీశా శ్రీకాంత్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస రావు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *