పటాన్ చెరు
పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ఒత్తిడి దూరం కావాలంటే ప్రతి ఒక్కరు దైవచింతన అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడంతోపాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, ఆలయ కమిటీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
