పోచారం ఎల్లమ్మ తల్లి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

Districts politics Telangana

మనవార్తలు,పటాన్ చెరు:

పటాన్ చెరు మండలం పోచారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేనీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, యాదగిరి యాదవ్, విజయ్ కుమార్, బిక్షపతి, స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *