అమీన్పూర్
అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో నూతనంగా నిర్మించతలపెట్టిన సేవాలాల్ మహారాజ్ మరియు జగదంబిక భవాని దేవాలయాల భూమి పూజ కార్యక్రమం లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ట్లు తెలిపారు. సొంత నిధులతో పురాతన ఆలయాలను జీర్ణోద్ధారణ గావించడంతో పాటు నూతన ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఎదుటివారికి సేవ చేయడం తో పాటు, దైవభక్తిని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సర్పంచులు కృష్ణ, మల్లేష్, రవి, టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఈర్ల రాజు, సత్యనారాయణ, గ్రామ ప్రజాప్రతినిధులు, బంజారా సేవాలాల్ ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.