పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
అన్ని మతాల సారాంశం ఒక్కటేనని, ఏసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం చిట్కుల్, ఇంద్రేశం గ్రామ పరిధిలోని ఆర్కే కాలనీలో క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకలు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అన్ని మతాల ప్రధాన పండుగలను అన్ని వర్గాల ప్రజలు సంతోషాలతో నిర్వహించుకోవాలని లక్ష్యంతో ప్రభుత్వం తరఫున కానుకలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, చిట్కుల్ ఉపసర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంతిరెడ్డి, బండి శంకర్, రామచంద్ర రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, చర్చి పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…