గ్రామీణ జాతరలలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

politics Telangana

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే జాతరలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్నాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం భానురు గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర, రుద్రారం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. గత దశాబ్ది కాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో రెండు వందలకు పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో రామచంద్రాపురం కార్పోరేటర్ పుష్ప నగేష్, భానూరు సిఐ స్వామి గౌడ్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, పాండు, సుధీర్ రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, రాజు, వెంకన్న, నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *