మనవార్తలు , అమీన్ పూర్
అమీన్ పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పటేల్ గూడ గ్రామం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రజలు ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్లనున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్, శ్రీకాంత్, సుశీల్ దాస్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.