Telangana

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నష్ట పరిహారం పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన నల్లా సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కుని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. అనంతరం గుమ్మడిదల మండలం అన్నారం, జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన రెండు బర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందగా, 40 వేల రూపాయల చొప్పున 80 వేల రూపాయలు నష్ట పరిహారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ మాజీ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, షేక్ హుస్సేన్, విద్యుత్ శాఖ ఏడిలు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, ఏఈలు రాజు, అనంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago