పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన నల్లా సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కుని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. అనంతరం గుమ్మడిదల మండలం అన్నారం, జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన రెండు బర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందగా, 40 వేల రూపాయల చొప్పున 80 వేల రూపాయలు నష్ట పరిహారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ మాజీ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, షేక్ హుస్సేన్, విద్యుత్ శాఖ ఏడిలు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, ఏఈలు రాజు, అనంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…