పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన నల్లా సాయి కుమార్ కుటుంబానికి విద్యుత్ శాఖ తరఫున మంజూరైన ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెక్కుని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. అనంతరం గుమ్మడిదల మండలం అన్నారం, జిన్నారం మండలం లక్ష్మీపతిగూడెం గ్రామాల్లో ఇద్దరు రైతులకు చెందిన రెండు బర్రెలు విద్యుత్ షాక్ తో మృతి చెందగా, 40 వేల రూపాయల చొప్పున 80 వేల రూపాయలు నష్ట పరిహారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ మాజీ చైర్మన్ ప్రభాకర్, గుమ్మడిదల మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, షేక్ హుస్సేన్, విద్యుత్ శాఖ ఏడిలు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, ఏఈలు రాజు, అనంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…