మనవార్తలు ,అమీన్పూర్:
అమీన్పూర్ మండలం పటేల్ గూడ డ గ్రామ పరిధిలోని బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీలో స్థానిక మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ, అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మైనార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు.