పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాదులోని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గానికి గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని, రిజిస్ట్రేషన్ కార్యాలయం, ఆర్డీవో కార్యాలయం, పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన జీవోలను అమలు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి కుమారులు గూడెం సందీప్ రెడ్డి, గూడెం సంతోష్ రెడ్డిలు సైతం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపదాస్ మున్షీ, మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…