Telangana

మైత్రిలో ముస్తాబవుతున్న మినీ కైలాసం..

_50 అడుగుల భారీ శివలింగం.. 15 అడుగుల ధ్యానముద్ర శివుడు..

_వేద బ్రాహ్మణులచే శివపార్వతుల కళ్యాణం, లింగోద్భవం

_సినీ కళాకారులచే సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మహాశివరాత్రి మహా జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారుగురువారం మహా జాగరణ నిర్వహించబోతున్న పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ప్రజలందరూ సామూహికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను వీక్షిస్తూ ఆ పరమ శివుడిని ధ్యానిస్తూ జాగరణ నిర్వహించాలన్న తలంపుతో మహా జాగరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సాక్షాత్తు పరమశివుడి నివాసమైన కైలాసగిరిని మరిపించేలా పర్వతాలు, 50 అడుగుల శివలింగం, 15 అడుగుల ధ్యానముద్ర శివుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సినీ ఆర్ట్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

శనివారం సాయంత్రం 6 గంటల నుండి వేద బ్రాహ్మణులచే మహన్యాస అభిషేకం, పల్లకి ఊరేగింపు, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రముఖ సినీ గాయకులు వందేమాతరం శ్రీనివాస్, ఎస్పీ చరణ్, సునీత, సుమంగళి, గద్దర్ నరసింహ, మౌనిక యాదవులతోపాటు ప్రముఖ తెలుగు వ్యాఖ్యాత సుమ కనకాల, తెలంగాణ యాస, భాషకు ప్రతిరూపమైన బిత్తిరి సత్తి, తదితర కళాకారులచే సంగీత విభావరి, సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.భక్తుల సంఖ్యకు అనుగుణంగా సీటింగ్ సదుపాయం, మంచినీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల వాహనాల కోసం సాకి చెరువు కట్ట, ప్రభుత్వ ఆసుపత్రి, బ్లాక్ ఆఫీస్, రహదారి బంగ్లా తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.భక్తులందరూ సకాలంలో కార్యక్రమానికి హాజరై దిగ్విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

4 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

4 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago