Telangana

హైదరబాద్ మెట్రో రైలు సాధన సమితి సభ్యులు

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణ పనులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ చేసిన ప్రకటనపై మెట్రోరైల్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మెట్రో రైల్ రెండో దశ విస్తరణ చేపడతామన్న కేటీఆర్ ప్రకటనపై పటాన్ చెరులోని రాజన్ సింగ్ నివాసంలో మెట్రో రైల్ సాధన సమితి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు .ఈ సమావేశంలో కమిటీ సభ్యులతో విస్తృతంగా చర్చించి ఆయన ప్రకటన పై అసంతృప్తి వ్యక్తం చేసారు. అతి పెద్ద పారిశ్రామిక వాడ అయిన పటాన్ చెరు, పాశమైలారం ప్రాంతంలో లక్షలాదిమంది ప్రజలు, కార్మికులు నిరంతరం రోడ్డు రవాణా వ్యవస్థ పై ఆధరపడుతూ పరిశ్రమలో పని చేస్తున్నారని తెలిపారు. కార్మికులు, కర్షకుల, ప్రయాణీకుల విలువైన సమయాన్ని వృధా అవుతుందని, ఇంటికి చేరే సమయాన్నీ ఎక్కువ వెచ్చించి జీవితంలో కుటుంబ సభ్యులతో సఖ్యత కోల్పొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు .ఈ విషయాన్ని కార్మికులతో పాటు ఇతర అవసరాలకు ప్రయాణిస్తున్న లక్షలాది మంది ప్రజలు మెట్రోరైల్ సాధన సమితి దృష్టి కి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రజల అభిష్ఠం మేరకు ప్రభుత్వం, మంత్రి కే.టీ.ఆర్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని తెలిపారు. మెట్రోరైల్ విస్తరణ పనులను మియాపూర్ నుండి పటాన్ చెరు మీదుగా సంగారెడ్డి వరకు విస్తరించాలని డిమాండ్ చేశారు . లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని మరింత ఉదృతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్ళనున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్ రాజన్ సింగ్, గోకుల్ ,శ్రీధర్, అబ్దుల్ బాసిత్ ,మెట్టు శ్రీధర్ , కంది శ్రీను, కర్నే శ్రీధర్ ,మహేష్ ,బంటి, చరణ్ తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

5 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

5 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

5 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

5 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

5 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago