* ఆలయం ప్రథమ వార్షికోత్సవానికి ఆహ్వానించిన కమిటీ
* కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పటాన్ చెరు మండలం చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు . అనంతరం ఆలయ కమిటీ సభ్యులు నీలం మధు ముదిరాజ్ ను శాలువాతో సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ చిట్కుల్ లోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు చాల సంతోషంగా ఉందని అన్నారు. భగవంతుడి దయవల్ల రాష్ట్రం లోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ,స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నీలం మధు ముదిరాజ్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, నారాయణరెడ్డి, నరేందర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, వీరస్వామి, అంజిరెడ్డి, ఆలయ కమిటీ మెంబర్లు, తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…