Hyderabad

వలస కార్మికురాలికి అంత్యక్రియలు నిర్వహించినఎండీఆర్ ఫౌండేషన్

పటాన్ చెరు:

మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా రూపాంతరం చెందిన నేటి పరిస్థితుల్లో ఎండీఆర్ ఫౌండేషన్ మానవతా కోణంలో సేవ చేస్తోంది. మరణించిన తరువాత దగ్గరి వారు కూడా ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చినప్పుడు నాకెందుకులే అనుకునే రోజులివి. కానీ పటాన్ చెరు కేంద్రంగా జిల్లా ప్రజలకు సేవలు అందిస్తున్నఎండీఆర్ ఫౌండేషన్ మాత్రం అనాధలకు అన్నీ తానై ఆదుకుంటుంది.

తాజాగా ఒరిస్సా నుండి వలస వచ్చి చనిపోయిన ఓ మహిళకు సోమవారం అంత్యక్రియలు నిర్వహించింది ఎండీఆర్   ఫౌండేషన్ అధ్యక్షుడు మధు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రానికి చెందిన విజయ్ అతని భార్య ఇద్దరు వలస వచ్చి పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ లో నివాసం ఉంటున్నారు. రోజు కూలీలుగా పని చేసుకుని జీవనం గడుపుతున్నారు. విజయ్ భార్య నీలిమ అనారోగ్యంతో మృతి చెందింది. నిరుపేదలైన వీరు మృతదేహాన్ని ఒరిస్సాకు తీసుకుపోలేక, నగరంలో అంత్యక్రియలు నిర్వహించలేక ఆర్థిక నిస్సహాయతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఈ తరుణంలో బండ్లగూడ మాజీ వార్డు సభ్యులు చంద్రశేఖర్, శ్రీనివాస్, అజ్జు, కాలీల్ ల సహాయంతో ఎండిఆర్ ఫౌండేషన్ ను సంప్రదించారు. మానవతా దృక్పథంతో పని చేస్తున్న ఆ ఫౌండేషన్ అధ్యక్షుడు మధు వెంటనే స్పందించి ఫౌండేషన్ తరఫున ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మృతురాలి భర్త తో పాటు గ్రామస్తులు ఎండిఆర్ ఫౌండేషన్ సేవలను అభినందించారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago