అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలి

politics Telangana

_బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ అని, అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బక్రీద్ పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని తన నివాసంలో ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.మినీ ఇండియా గా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవించడంతోపాటు అన్ని పండుగలు కలిసి చేసుకుంటారని తెలిపారు. గంగా జమున తెహజీబ్ సంస్కృతికి తెలంగాణ నిదర్శనం అన్నారు.పట్టణంలోని సయ్యద్ హజరత్ మురాద్ అలీషా దర్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి పాల్గొని, ముస్లిం సోదరులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *