-పాఠశాల విద్యార్థులకు గణితం, సెన్స్ ప్రాముఖ్యతలను వివరించిన గీతం విద్యార్థులు
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
వ్యక్తుల విశ్లేషణాత్మక సామర్థ్యాలను రూపొందించడంలో, పోటీ పరీక్షలను వారిని సిద్ధం చేయడంలో గణిత శాస్త్రం క్రియాశీలక భూమిక పోషిస్తోందని, గణితంపై పట్టు విజయానికి తొలి మెట్టుగా గీతం విద్యార్థులు అభివర్ణించారు.గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విద్యార్థులు మంగళవారం రుద్రారంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం, సెన్స్ ప్రాముఖ్యతను వివరించడానికి ఉద్దేశించిన ఔట్రచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని గణిత శాస్త్ర విభాగం నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు గీతం విద్యార్థులు పాల్గొని, గణితం, సెన్స్ లపై ప్రేమను పెంపొందించడంతో పాటు చొరవను కొనసాగించాల్సిన ఆవశ్యకతను కార్యక్రమ సమన్వయకర్త, గణిత శాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పాశం నరసింహస్వామి మాట్లాడుతూ, వివిధ రంగాలలో విజయానికి అవసరమైన విమర్శనాత్మక ఆలోచనా నైఫుణ్యాలను పెంపొందించడంలో గణిత శాస్త్రం: పాత్రను నొక్కి చెప్పారు. తమ ఈ ప్రయత్నానికి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారం అవసరమని డాక్టర్. స్వామి అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో రుద్రారం ఉన్నత పాఠశాలకు చెందిన 120 నుంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రణవి, షాజియా, చందన, కార్తీక ల నేతృత్వంలో సుమారు ఇరవై మంది గీతం విద్యార్థులు ఈ కార్యక్రమం సఫలం కావడానికి కృషి చేశారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…