శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
ప్రాపర్టీ టాక్స్ పై 90 శాతం వడ్డీని మాఫీ చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జిహెచ్ఎంసి కమిషనర్ కు హఫీజ్ పేట్ డివిజన్ బిజెపి కాంటెస్ట్ కార్పొరేటర్ బోయిని అనుషా మహేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అనూష మహేష్ యాదవ్ మాట్లాడుతూ పది రోజుల క్రితం జిహెచ్ఎంసి కమిషనర్ మరియు జిహెచ్ఎంసిలో బిజెఎల్పి నేత శంకర్ యాదవ్ ను కలిసి ప్రాపర్టీ టాక్స్ పై వడ్డీ మాఫీ చేయాలని ప్రజలు కరోనా ప్రభావంతో మరియు ఆర్థిక మాన్యంతో ఆర్థికంగా చితికిపోయి ఉన్నారని వారికి వడ్డీ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రం సమర్పించడం జరిగిందని తెలిపారు.
దీనికి సానుకూలంగా కమిషనర్ మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన విజ్ఞప్తికి సీఎం అంగీకరించి వడ్డీ మాఫీ చేసినందుకు అయన కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.