పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా చిట్కుల్లోని ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని, అంటరానితనం, కుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని తెలిపారు . అలాగే అణగారిన వర్గాల అభివృద్ధి, వారి రాజకీయ న్యాయం అందించడానికి నిరంతరం పోరాటం చేశారని ,సమాజంలో వివక్షకు తావు లేదని సమానత్వం ఉండాలని , జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు . వెనుకబడిన వర్గాలకు దళిత జనోద్ధారణకు ఆయన ఎంచుకున్న బాట అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సు కొరకు వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు . ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యులు చదువులతోనే సమన్వయం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని ఆయన మార్గంలోనే మనం పయనించాలని నీలం మధు ముదిరాజు అన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…