పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా చిట్కుల్లోని ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నీలం మధు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే అందరికీ ఆదర్శనీయుడని, అంటరానితనం, కుల వ్యవస్థ, అణగారిన కులాలకు విద్యను అందించడంలో ఆయన కృషి ఎనలేనిదని తెలిపారు . అలాగే అణగారిన వర్గాల అభివృద్ధి, వారి రాజకీయ న్యాయం అందించడానికి నిరంతరం పోరాటం చేశారని ,సమాజంలో వివక్షకు తావు లేదని సమానత్వం ఉండాలని , జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు . వెనుకబడిన వర్గాలకు దళిత జనోద్ధారణకు ఆయన ఎంచుకున్న బాట అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సు కొరకు వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు . ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం మహిళా సాధికారత ఉద్యమాలకు ఆద్యులు చదువులతోనే సమన్వయం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు అని ఆయన మార్గంలోనే మనం పయనించాలని నీలం మధు ముదిరాజు అన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…