మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
పటాన్చెరు పట్టణంలోని ఇక్రిసాట్ సమీపంలోని రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి మహాశివరాత్రి సందర్భంగా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ఆదివారం ఉదయం నుండి వివిధ ప్రాంతాల నుండి విషేచేసిన వేలాది మంది భక్తులు స్వామివారి దర్శించుకున్నారు.కార్యక్రమాల్లో భాగంగా మహాశివరాత్రి రోజున మూడు గంటల నుండి స్వామివారికి రుద్రాభిషేకం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు సాయంత్రం ప్రత్యేక అలంకరణ నక్షత్ర హారతి రాత్రి నటరాజ స్ఫూర్తి కూచిపూడి కళాక్షేత్రం నాట్యగురు శ్రీమతి కె జ్యోతి కులాకర్ణి మరియు శ్రీమతి పూజా గారి నేతృత్వంలో చిన్నారులు నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు అనంతరం లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం అభిషేకం సోమవారం పార్వతి ఉదయం పార్వతి రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం సాయంత్రం పల్లకి సేవ ఏకాంత సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు మహేష్ స్వామి తెలిపారు.
