politics

క్యాన్సర్‌ పరిశోధన చేపట్టిన మధుసూదనరెడ్డికి డాక్టరేట్ …

పటాన్ చెరు:

‘ కొత్త క్యాన్సర్ నిరోధక ఏజెంట్లుగా ఇమిడాజో – పిరిడిన్ , పిరిమిడిన్ , స్పిరో అండర్ కేన్ ఆధారిత కేంద్రీకృత నమూనాల రూపకల్పన , సంశ్లేషణ , జీవ మూల్యాంకనం’పై అధ్యయనం చేసి , సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైదరాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి జి.మధుసూదనరెడ్డిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్డ్ లోని రసాయన శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ రాంబాబు గుండ్ల బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు .

ఈ పరిశోధనలో నూతన క్యాన్సర్ నిరోధక ఏజెంట్లను అభివృద్ధి చేయడం , క్యాన్సర్ గుర్తించి క్లుప్త అధ్యయనాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు . కీమోథెరపీ ఔషధాల ఆవశ్యకత ఆధారంగా , అధిక శక్తి , కనీస దుష్ప్రభావాలున్న ఇమిడాజో పిరిడిన్ , సిరిమిడిన్ , డయాజాస్పిరో వంటి మూడు నూతన శ్రేణి ఔషధాలను అభివృద్ధి చేసినట్టు పేర్కొన్నారు . వీటిని ప్రయోగించి చూడగా , 47 అణువులలో 12 అద్భుతమైన క్యాన్సర్ నిరోధక చర్యను ప్రదర్శించినట్టు తెలియజేశారు .

మధుసూదనరెడ్డి సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , వివిధ విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .

ఇవి చదవండి

గీతంలో బీ.ఆప్తో, బీఎస్సీ, ఎమ్మెస్సీ అడ్మిషన్లు

విజన్ వీవీకే హౌసింగ్ కార్పొరేట్ ఆఫీసును ప్రాంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago