Telangana

అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాడి

ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ప్రముఖ రచయిత, కవయిత్రి డాక్టర్ మీనా కందసామి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశ్నించడం ప్రజల హక్కని, అసమ్మతి ప్రజాస్వామ్యానికి జీవనాధారం అని ప్రముఖ రచయిత, కవయిత్రి డాక్టర్ మీనా కందసామీ స్పష్టీకరించారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లోని మీడియా స్టడీస్, ఆంగ్లం-ఇతర భాషల విభాగాల ఆధ్వర్యంలో ‘అసమ్మతి, సంభాషణ: ప్రజాస్వామ్య సమాజంలో మానవ హక్కుల ప్రాముఖ్యత’ అనే అంశంపై శనివారం ఆమె అతిథ్య ఉపన్యాసం చేశారు.మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ మీనా మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యంలో అసమ్మతి యొక్క కీలక పాత్రపై తన అభిప్రాయాలు, దృక్పథాలను వెల్లడించారు. ప్రస్తుత సామాజిక-రాజకీయ దృశ్యాన్ని ప్రశ్నించడం యొక్క ఆవశ్యకతను ఆమె నొక్కి చెప్పారు. దైహిక సమస్యలతో విభేదించడానికి, విమర్శనాత్మకంగా పాల్గొనడానికి ప్రజలకు స్వేచ్చ. స్థలం ఉందా అని ఆలోచించమని ఆమె కోరారు. ప్రైవేటు యాజమాన్యంలో మీడియా ఏకీకరణ యొక్క భయంకరమైన ధోరణిని ఆమె ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ఇది తరచుగా అట్టడుగు స్వరాలను నిశ్శబ్దం చేస్తోందంటూ ఆవేదన వెలిబుచ్చారు.

అసమ్మతి రచయితలు, మేధావులను ‘అర్బన్ నక్సల్స్’ లేదా ‘జాతి వ్యతిరేకులు’ అని ముద్ర వేసే సమస్యాత్మక ధోరణిని కూడా డాక్టర్ కందసామి ప్రస్తావించారు. కార్పొరేట్ అభివృద్ధి, వనరుల దోపిడీపై రాజ్యం దృష్టి సారించడాన్ని ఆమె విమర్శించారు. భిన్నాభిప్రాయాలకు సమాజం ఎలా విలువ ఇస్తుందో పునఃపరిశీలన చేయాలని పిలుపునిచ్చారు.గీతం ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ సయంతన్ మండల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం చివరన డాక్టర్ కందసామి తన పదునైన పద్యం ‘రేపు ఎవరో మిమ్మల్ని అరెస్టు చేస్తారు’ ఆమె ప్రసంగంలోని అంశాలను లోతుగా ప్రతిధ్వనింపజేసింది.సమాజంలో విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడంలో ఇటువంటి చర్చల ప్రాముఖ్యత ఉందంటూ డాక్టర్ శ్రుతీష్ చేసిన వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో పాల్గొన్నవారు మానవ హక్కులు, భిన్నాభిప్రాయాల ఆవశ్యకత, ప్రజా సంభాషణను రూపొందించడంలో మీడియా పాత్ర గురించి అవగాహనను పునరుద్ధరించుకున్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

3 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

4 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

4 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

4 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago