కలసికట్టుగా సమస్యలు పరిష్కరించుకుందాం … చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

Districts politics Telangana

మనవార్తలు ,పటాన్ చెరు:

అందరం కలిసికట్టుగా గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .శనివారం చిట్కుల్ గ్రామాల్లో వార్డు 2,3,5 ల లో సీసీ రోడ్లు కు, గ్రామ ఉప్ప సర్పంచ్,ఎంపీటీసీ నరేందర్ రెడ్డి ,నారాయణ రెడ్డి వార్డు సభ్యుల తో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిధులతో సిసి రోడ్లు లకు శంకుస్థాపన , గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని పరిష్కరించే విధంగా కృషి చేస్తాను అని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి గత ప్రభుత్వాల హయాంలో ఏ గ్రామానికి అభివృద్ధ్ద జరగలేదని ,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పారదర్శకంగా పరిపాలన అందిస్తూ గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు పోతున్నారని తెలిపారు .

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేసినప్పుడే ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం పొందుతామని సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మాజీ ఎంపీపీ శ్రీశైలం ,మాజీ సర్పంచ్ రవీందర్, దుర్గయ్య, వెంకటేష్, కృష్ణ, శ్రీశైలం, రాజ కుమార్, నర్సింగ్ యాదవ్, తలారి ఆంజనేయులు,వెంకటేష్ భుజంగం. శ్రీను. మురళి. టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ప్రశాంత్,ఎన్ ఎన్ ఎం యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *